telugu navyamedia
వార్తలు సామాజిక

ఫలక్‌నుమా, కోణార్క్ ఎక్స్‌ప్రెస్ స్టాపుల కుదింపు!

కరోనా వ్యాప్తి నేపథ్యంలో రైళ్లలో ప్రయాణీకుల సంఖ్య గణనీయాంగా పడిపోయింది. ఈ నేపథ్యంలో రైల్వే శాఖ కొన్ని రైళ్ల స్టాపులను కుదించింది. సికింద్రాబాద్-హౌరా మధ్య నడిచే ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ రైలు స్టాపులను కుదిస్తూ రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. కరోనా ప్రభావం కారణంగా ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.

ఒడిశాలోని బలుగాం, బరంపురం స్టేషన్లలో ఇప్పటి వరకు ఈ రైలుకు స్టాపులు ఉండగా, నిన్నటి నుంచి ఈ రెండు స్టాపులను తొలగించింది. భువనేశ్వర్- ముంబై సీఎస్‌టీ మధ్య నడిచే కోణార్క్ ఎక్స్‌ప్రెస్ రైలు స్టాపులను కూడా తగ్గించింది. బరంపూర్, ఛత్రపూర్, బలుగాం స్టేషన్లలో ఇప్పటి వరకు ఈ రైలు ఆగుతుండగా ఇకపై ఈ స్టేషన్లలో రైలు ఆగదని అధికారులు పేర్కొన్నారు.

Related posts