telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ

తప్పుడు శీర్షిక పై ఖండన..

తెలంగాణ రాష్టం ఆవిర్భావం అనంతరం పాలన సౌలభ్యం కోసం ప్రభుత్వం 31 జిల్లాలు ఏర్పాటు చేసింది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఏడు కొత్త జోన్ ల కు ఆమోదం తెలిపింది. ఇందుకు సంబధించిన గెజిట్ నోటిఫికేషన్ ను గత ఆగస్ట్ నెలలో జారీ చేసింది. అయితే అవగాహన లోపంతో పొరపాటున కొన్ని సామాజిక మాధ్యమాల్లో గతంలో వచ్చిన తప్పుడు సమాచారం ఆధారంగా ‘తెలంగాణలో 17 జిల్లాలకే .. కేంద్రం ఆమోదం’ అనే శీర్షికను ప్రచురించినందుకు చింతిస్తున్నాం. భవిష్యత్తులో ఇలాంటి నిరాధారమైన తప్పుడు వార్తలను పోస్ట్ చేయబోమని పాఠకులకు తెలియజేస్తున్నాం.

Related posts