telugu navyamedia
క్రైమ్ వార్తలు తెలంగాణ వార్తలు వార్తలు

నక్సలైట్ల పేరుతో బెదిరింపులు.. ముగ్గురు వ్యక్తులు అరెస్ట్

ARREST crime

తెలంగాణలోని మంచిర్యాల జిల్లా జైపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నక్సలైట్ల పేరుతో బెదిరించి బలవంతపు వసూళ్ళకు పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టాస్క్ ఫోర్స్, జైపూర్ పోలీసులు చెన్నూరు క్రాస్ రోడ్ వద్ద ముగ్గురిని అరెస్ట్ చేశారు. నిందితులు నకిలీ నక్సలైట్లుగా చెలామణి అవుతూ బలవంతపు వసూళ్ళకు పాల్పడుతున్నట్లు గుర్తించి..నిందితుల నుండి ఒక దేశీయ పిస్తోల్, 8 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది.

Related posts