పదో తరగతి వరకు చదివి వైద్యం చేస్తున్నా ఓ నకిలీ డాక్టర్ గుట్టు బయటపడింది. పోలీసులు అతడిని అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే… హైదరాబాద్లోని మెహిదీపట్నంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఈ విషయం బయటకు పోక్కింది. ఆ ప్రాంతంలో షోహెబ్ అనే వ్యక్తి ఆసుపత్రి నిర్వహిస్తున్నాడు. అతడి ఆసుపత్రిలోనే ముజిబ్ అనే నకిలీ డాక్టర్ రోగులకు వైద్యం చేస్తూ వారి ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాడు.
అతడు ఎంబీబీఎస్ చదవలేదని గుర్తించిన కొందరు ఇచ్చిన సమాచారం మేరకు అసిఫ్నగర్ పోలీసులు ఆ ఆసుపత్రిపై దాడులు చేశారు. ముజిబ్తో పాటు అతడిని పనిలో పెట్టుకున్న షోహెబ్ను పోలీసులు అరెస్టు చేశారు. వారికి వైద్యుడిగా నకిలీ సర్టిఫికేట్ ఎలా వచ్చిందన్న విషయంపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. మరికొంత మంది నకిలీ డాక్టర్ల వ్యవహారం కూడా బయటపడుతున్నట్లు తెలుస్తోంది.
జగన్ ఢిల్లీ పర్యటన పై టీడీపీ నేతల విమర్శలు