telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ

చత్తీస్‌గఢ్‌ మాజీ ముఖ్యమంత్రి అజిత్‌ జోగిపై.. ఎఫ్ఐఆర్ నమోదు…

f.i.r. recorded in chattishgarh ex cm

చత్తీస్‌గఢ్‌ మాజీ ముఖ్యమంత్రి అజిత్‌ జోగి, ఆయన కుమారుడు అమిత్‌ జోగి, బిజెపి నేత రాజేష్‌ మునత్‌, మాజీ మంత్రి మౌంతురం పవార్‌, మాజీ ముఖ్యమత్రి రమణ్‌ సింగ్‌ అల్లుడు పునీత్‌ గుప్తాపై అంత్‌ఘర్‌ టేప్‌ కుంభకోణం కేసులో సోమవారం ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. 2014 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఫిక్సింగ్‌ఫై అజిత్‌ జోగి, ఆయన కుమారుడు మధ్య జరిగిన సంభాషణలే ఆడియో టేపుల రూపంలో బయటపడ్డాయి.

వీరితో పాటు మరి కొంత మంది నాయకులు కూడా ఫిక్సింగ్‌లో పాలుపంచుకున్నట్లు వార్తలు వచ్చాయి. కాంగ్రెస్‌ నేత కిరణ్మయి నాయక్‌ ఇచ్చిన ఫిర్యాదుతో ఐపిసి సెక్షన్‌లోని 406, 420ల కింద పాండ్రీ పోలీసులు కేసు నమోదు చేశారు.

Related posts