telugu navyamedia
క్రైమ్ వార్తలు రాజకీయ వార్తలు

పుల్వామా ఉగ్ర‌దాడి..పేలుడుప‌దార్ధాలు పాక్‌లో ఖ‌రీదు!

Force deleted political leaders Kashmir

జమ్మూ కశ్మీర్‌లో సైనిక ఆర్మీ జవానులే లక్ష్యంగా ఉగ్రవాదులు పుల్వామాలో దాడికి పాల్పడి 40 మంది సైనికులను పొట్టనబెట్టుకున్న ఘటన గతేడాది చోటుచేసుకుంది. అయితే ఆ దాడికి పాల్ప‌డిన జేషే ఉగ్ర‌వాది షాకిర్‌ బాషిర్ మాగ్రేను .. శుక్ర‌వారం రోజున ఎన్ఐఏ పోలీసులు కోర్టు ముందు హాజ‌రుప‌రిచారు. షాకిర్ బాషిర్ విచార‌ణ‌లో అనేక సంచ‌ల‌నాత్మ‌క విష‌యాలు వెలుగులోకి వచ్చాయి.

పుల్వామా దాడికి కావాల్సిన పేలుడు ప‌దార్ధాల‌ను షాకిర్ పాక్‌లో నే ఖ‌రీదు చేశాడ‌ట. ఐఈడీ బాంబు త‌యారీ కోసం అమోనియం నైట్రేట్‌, నైట్రో గ్లిజ‌రిన్‌, ఆర్డీఎక్స్ లాంటి ప‌దార్ధాల‌ను ఆన్‌లైన్‌లో కొన్న‌ట్లు షాకిర్ విచార‌ణ‌లో చెప్పాడు. బ్యాట‌రీని, అమోనియం నైట్రేట్‌ను ఓ పోర్టల్ ద్వారా ఖ‌రీదు చేసిన‌ట్లు క్లారిటీ ఇచ్చాడు. సీఆర్‌పీఎఫ్ కాన్వాయ్‌ను పేల్చేందుకు తీసుకు వ‌చ్చిన మారుతీ ఎకో కారును కూడా దాడి ప్రాంతానికి 500 మీట‌ర్ల దూరం వ‌ర‌కు షాకిరే డ్రైవ్ చేశాడు. ఆ త‌ర్వాతే అదిల్ అహ్మ‌ద్ దార్ ఆ కారుతో జ‌వాన్ల వాహ‌నాన్ని ఢీకొట్టాడు. సుమారు 80 కేజీల ఆర్డీఎక్స్‌తో దాడికి పాల్ప‌డ్డారు. పాక్‌లో ఖ‌రీదు చేసిన ఆ పేలుడు ప‌దార్ధాల‌ను ఎల్వోసీ రూట్లో ఇండియాకు తీసుకువ‌చ్చాడు.

Related posts