telugu navyamedia
క్రైమ్ వార్తలు రాజకీయ వార్తలు సామాజిక

నిర్వీర్యం చేస్తుండ‌గా.. శ్రీలంక‌లో పేలిన మ‌రో బాంబు

bomb blast srilanka

శ్రీలంక‌లో ఇవాళ మ‌రో బాంబు పేలుడు సంభవించింది. కొలంబోలో ఓ చ‌ర్చి వ‌ద్ద బాంబు స్క్వాడ్ ఓ బాంబును నిర్వీర్యం చేస్తున్న స‌మ‌యంలో అది పేలింది. చ‌ర్చి వ‌ద్ద ఉన్న ఓ వ్యాన్‌లో ఆ బాంబు పేలిన‌ట్లు తెలుస్తోంది. మ‌రోవైపు కొలంబోలోని ఓ బ‌స్సు స్టేష‌న్ వ‌ద్ద 87 బాంబు డిటోనేట‌ర్ల‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పెట్టా ఏరియాలో ఉన్న కొలంబో సెంట్ర‌ల్ బ‌స్ స్టేష‌న్ నుంచి వాటిని సీజ్ చేశారు.

బ‌స్టాండ్ స‌మీపంలో సుమారు 12 బాంబు డిటోనేట‌ర్లు మైదానంలో చెల్లాచెదురుగా ప‌డి ఉన్నాయి. దాంతో పోలీసులు ఆ ప్రాంతంలో గాలింపు చేప‌ట్టారు. ఆ స‌మ‌యంలో మ‌రో 75 డిటోనేట‌ర్లు ల‌భ్యం అయ్యాయి. శ్రీలంకలో ఉగ్రదాడుల నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ఎమర్జెన్సీ విధించారు. ఈరోజు అర్ధరాత్రి నుంచి అత్యవసర పరిస్థితి విధిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.

Related posts