telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ రాజకీయ

మోడీని చంపేస్తా అంటున్న .. మాజీ సైనికుడు.. వైరల్‌..

ex soldier video on killing modi for 50 cr

ప్రధాని నరేంద్ర మోదీపై వారణాసి లోక్సభ నియోజకవర్గంలో పోటీకి ప్రయత్నించిన “బీఎస్‌ఎఫ్‌ మాజీ జవాను తేజ్‌ బహదూర్‌ యాదవ్‌” కు సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం అంతర్జాలంలో సంచలనం రేపుతోంది. ₹50 కోట్లు ఇస్తే ప్రధాని నరేంద్ర మోదీని చంపేస్తానని ఆయన చెప్తున్నట్టుగా ఉన్న వీడియో ప్రస్తుతం వైరల్‌ అవుతోంది. సమాజ్ వాదీ తరఫున వారణాసిలో తేజ్‌ బహదూర్‌ దాఖలు చేసిన నామినేషన్‌ పత్రాలను పలుతప్పిదాల కారణంగా ఎన్నికల సంఘం తిరస్కరించింది. ఈ నేపథ్యంలో ఆయనకు సంబంధించిన రెండేళ్ల కిందట వీడియో వెలుగులోకి వచ్చింది. ఈ వీడియో ఎంతవరకు ప్రామాణికమైనదనే అంశం ఇంకా తేజ్‌ బహదూర్‌ తేలలేదు.

తేజ్‌ బహదూర్‌, జాతీయ చానెళ్లలో ప్రసారమైన వీడియోలో ఒక స్నేహితుడితో మాట్లాడుతూ, ₹ 50 కోట్లు ఇస్తే మోదీని చంపేస్తానని చెప్పాడు. పాక్ ఆ డబ్బు ఇస్తుందని స్నేహితుడు బదులివ్వగా, తాను దేశభక్తుడినని, ఆ దేశ సాయం తీసుకోబోనని, భారతీయుడు ఎవరైనా డబ్బు ఇస్తే, ఈ పని చేస్తానని అతను చెప్పుకొచ్చినట్టు ఈ వీడియో లో సంభాషణ ఉంది. ఈ వీడియో పై అధికార బీజేపీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఎస్పీ అభ్యర్థిగా బరిలోకి దిగిన వ్యక్తి ₹ 50 కోట్లతో ప్రధాని నరేంద్ర మోదీ హత్యకు కుట్ర చేయడం షాకింగ్‌ ఉందని, దీనిపై కేంద్ర దర్యాప్తు సంస్థలు దృష్టి సారించాలని బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు పేర్కొన్నారు. ఈ వీడియో మార్ఫింగ్‌ చేశారని, ఇది ఫేక్‌ వీడియో అని తేజ్‌ బహదూర్‌ అంటున్నారు.

Related posts