తెలంగాణ ఎన్నికల్లో చంద్రబాబు మహాకూటమి కట్టి కేసీఆర్ నెత్తిన పాలుపోశారని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ అన్నారు. కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేసి ఉంటే 50 సీట్లు కైవసం చేసుకునేదన్నారు. శుక్రవారం విశాఖలో ‘మీట్ ది ప్రెస్’లో ఆయన మాట్లాడుతూ..ఏపీలో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంటే టీడీపీ నష్టపోతుందని వ్యాఖ్యానించారు. చంద్రబాబును తక్కువ అంచనా వేయకూడదని, ఆయన బోర్న్ ఫైటర్ అని అభివర్ణించారు. జగన్ చేస్తున్న పాదయాత్రకు ఊహించని ఆదరణ లభిస్తోందన్నారు. జనసేన అధ్యక్షుడు పవన్ పై బాబు చేసిన వ్యాఖ్యలు మైండ్గేమ్లో భాగమని తెలిపారు.
కేంద్రం ఇచ్చే నిధులను ఎవరూ తమ జేబుల్లో వేసుకునే అవకాశమే ఉండదని స్పష్టం చేశారు. వాటిని దుర్వినియోగం చేసే చాన్సు మాత్రం ఉంటుందన్నారు.పోలవరం ప్రాజెక్టు నుంచి మే నెలలో నీరు ఇస్తామని చంద్రబాబు అనడం విడ్డూరంగా ఉందని ఉండవల్లి పేర్కొన్నారు. మేలో గోదావరిలో ఇన్ఫ్లో ఉండదని, ఒకవేళ వరదలొచ్చినా గ్రావిటీ ద్వారా నీరివ్వడం ఎట్టి పరిస్థితుల్లోనూ సాధ్యం కాదని తేల్చిచెప్పారు. చంద్రబాబు పాలన మొత్తం కుంభకోణాలమయంగా మారిపోయిందని ధ్వజమెత్తారు. అన్న క్యాంటీన్లలో పెట్టే ఒక్కో భోజనంపై రూ.27 చొప్పున తినేస్తున్నారని ఆరోపించారు సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు ఇలా అన్నింటికీ తాత్కాలిక భవనాలు నిర్మిస్తున్నారని, ఇదంతా ప్రజాధనం వృథా చేయడమేనని చంద్రబాబు ఆరోపించారు.
టీడీపీ కాపులనువాడుకుని వదిలేసింది: మంత్రి బొత్స