telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

కేసీఆర్‌ నమ్మించి గొంతు కోశారు: మాజీ ఎంపీ వివేక్

Peddapally Ex MP Vivek not contest

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై మాజీ ఎంపీ వివేక్‌ విరుచుకుపడ్డారు. కేసీఆర్‌ నమ్మించి గొంతు కోశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ప్రభుత్వ సలహాదారు పదవికి వివేక్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణపై అనుచరులతో వివేక్‌ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లాకు వెంకటస్వామి పేరు పెడతానని చెప్పి కేసీఆర్ మోసం చేశారన్నారు.

టీఆర్ఎస్ అభ్యర్థుల ఓటమికి తాను ప్రయత్నం చేశానని లేని పోనీ ఆరోపణలు చేస్తున్నారని కొట్టిపారేశారు. అభ్యర్థుల ఓటమికి తాను ప్రయత్నించినట్టు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ విసిరారు. బానిస సంకెళ్ళు తెగాయని, ఇక ప్రజల మధ్యే ఉంటానని స్పష్టంచేశారు. ప్రజల నిర్ణయం ప్రకారమే భవిష్యత్తు కార్యాచరణ ఉంటుందని వెల్లడించారు.

Related posts