telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

టూరిజం బోట్లలో మంత్రులకు వాటాలు: మాజీ ఎంపీ హర్షకుమార్‌

Ex mp harsha kumar joins ycp

తూర్పు గోదావరి జిల్లాలో సంభవించిన బోటు ప్రమాదంపై మాజీ ఎంపీ హర్షకుమార్‌ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, గోదావరి నదిలో మునిగిపోయిన బోటును బయటకు తీయాలన్న ఉద్దేశం ప్రభుత్వానికి లేనట్టు కనిపిస్తోందని విమర్శించారు. సెర్చ్ ఆపరేషన్ నిలిపివేసిన ప్రభుత్వాన్ని తాను నిలదీయడం వల్లే మళ్లీ కొనసాగిస్తున్నారని అన్నారు.

టూరిజం బోట్లలో మంత్రులు, ఎమ్మెల్యేలకు వాటాలున్నాయని ఆరోపించారు. ప్రమాదం ముందు పోలీసులు తీసిన ఫొటోలు, సెల్‌ఫోన్ సంభాషణలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు.చంద్రబాబు హయాంలో పుష్కరాల ప్రమాద ఘటనపై నాడు వైసీపీ తీవ్ర విమర్శలు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఆ ఘటనకు సంబంధించి ఒక్కరిపైనా చర్యలు తీసుకోలేదని నాడు విమర్శలు చేశారని, మరి, బోటు ప్రమాద ఘటనలో ఎవరిపై చర్యలు తీసుకున్నారని సీఎం జగన్ ని ప్రశ్నించారు.

Related posts