telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఆర్టీసీ కార్మికుల ఆగ్రహ జ్వాలల్లో కేసీఆర్ బుగ్గి: మాజీ ఎమ్మెల్యే బొడిగే శోభ

bodige shobha

తెలంగాణ సీఎం కేసీఆర్ పై చొప్పదండి మాజీ ఎమ్మెల్యే బొడిగే శోభ తీవ్ర విమర్శలు చేశారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె తీవ్ర రూపం దాల్చినప్పటికి కేసీఆర్ నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఆర్టీసీ కార్మికుల ఆగ్రహ జ్వాలల్లో కేసీఆర్ బుగ్గిగా మారుతారన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో సమ్మె చేస్తున్న కార్మికులకు శోభ, ఉపాధ్యాయ సంఘాల నాయకులు సంఘీభావం తెలిపారు ఈ సందర్భంగా శోభ మాట్లాడుతూ కేసీఆర్, మేఘా కృష్ణారెడ్డి, మైహోం రామేశ్వర్ రావులు తెలంగాణను దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు.

కార్మికులు సమ్మెను తీవ్రం చేసి తమ డిమాండ్లను నెరవేర్చుకోవాలన్నారు. పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన విషయాన్ని శోభ ఈ సందర్భంగా ప్రస్తావిస్తూ… జగన్ కు ఉన్న సోయి కేసీఆర్ కు లేదని దుయ్యబట్టారు. ఆర్టీసీ కార్మికులకు జీతాల విషయంలో హైకోర్టు కేసీఆర్ ను మందలించినా సోయి రావడం లేదని చెప్పారు. ఆర్టీసీ కార్మికులంతా కలిసి టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లను ముట్టడించాలని ఆమె పిలుపు ఇచ్చారు.

Related posts