telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

మళ్లీ ఇప్పుడా తప్పు చేయొద్దు: తుమ్మల

Tummala-nageswar-rao

మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రం మొత్తం టీఆర్ఎస్‌కు ఓటేస్తే ఖమ్మం జిల్లా ప్రజలు మాత్రం కాంగ్రెస్‌ను గెలిపించారని టీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. గురువారం ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ.. అప్పుడు కాంగ్రెస్‌కు ఓటేసిన వాళ్లు ఇప్పుడు కుమిలిపోతున్నారని అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో మళ్లీ ఆ పొరపాటు చేయొద్దని, అదే జరిగితే మిమ్మల్ని కుక్కలు కూడా దేఖవని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గెలిస్తే పాలేరును రాష్ట్రంలోనే నంబర్ వన్ చేద్దామని భావించానని, కానీ తనను ఓడించారని ఆవేదన వ్యక్తం చేశారు.

Related posts