టీడీపీ నేత, మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి ఇటీవల కాలంలో బీజేపీ లో చేరుతారని ప్రచారం జరిగింది. ఇందులో భాగంగానే హైద్రాబాద్ పర్యటనకు వచ్చిన బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డాను ఆదినారాయణరెడ్డి కలిశారు. బీజేపీలో చేరుతారని ప్రచారం సాగిన తరుణంలో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఈ నెల 3వ తేదీన చంద్రబాబునాయుడుతో మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి సమావేశమయ్యారు. ఈ సమావేశం తర్వాత టీడీపీలోనే కొనసాగాలని ఆదినారాయణరెడ్డి నిర్ణయం తీసుకొన్నట్లు తెలుస్తోంది.
చంద్రబాబుతో భేటీ అయిన తర్వాత ఆదినారాయణరెడ్డి తన వైఖరిని మార్చుకొన్నట్టుగా తెలుస్తోంది. పార్టీ అండగా ఉంటుందని ఆదినారాయణరెడ్డికి చంద్రబాబునాయుడు హామీ ఇచ్చినట్టుగా ప్రచారం సాగుతోంది. పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటానని కూడ ఆదినారాయణ రెడ్డి చంద్రబాబుకు హామీ ఇచ్చినట్టుగా చెబుతున్నారు.ఈ నెల 19వ తేదీన జిల్లా విస్తృతస్థాయి సమావేశాన్ని నిర్వహిస్తారు. ఈ నెల 20వ తేదీన ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలతో బాబు భేటీ కానున్నారు. టీడీపీని వీడి ఇతర పార్టీల్లో చేరే వారిని బుజ్జగించాలని కూడ పార్టీ నాయకత్వం భావిస్తోంది.