గెలుపు సెంటిమెంట్ ఉండటంతో అన్నివిధాలా మంచి రోజుగా భావించి నేడు వివిధ పార్టీల నుండి అనేక మంది వారివారి నామినేషన్ లు దాఖలు చేశారు. నేడు నామినేషన్ వేసిన వారిలో ఏపీసీఎం చంద్రబాబు, లోకేష్, వైసీపీ జగన్, బెంగుళూరు నుండి స్వతంత్ర అభ్యర్థిగా నటుడు ప్రకాష్ రాజ్ తదితరులు ఉన్నారు.
ఇక తాజాగా జనసేన కండువా కప్పుకున్న మాజీ జేడీ లక్ష్మీనారాయణ కూడా నేడే నామినేషన్ దాఖలు చేశారు. జనసేనలో చేరిన ఆయనకు ఆ పార్టీ విశాఖపట్నం నియోజక వర్గం నుండి పోటీకి దించుతున్న విషయం తెలిసిందే. ఆయన నేడు అధికారులకు తన నామినేషన్ పత్రాలను అందజేశారు.
చంద్రబాబు రైతులను రెచ్చగొడుతున్నారు: మంత్రి కన్నబాబు