మేడారం సమ్మక్క సారలమ్మల దీవెనలతోనే 2018 ఎన్నికల్లో కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ ఘన విజయం సాధించిందని మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా తాడ్వా యి మండలంలోని మేడారం సమ్మక్క-సారలమ్మను బుధవారం ఆయన కుటుంబ సభ్యులతో దర్శించుకున్నారు. బెల్లం (బంగారం), చీరను తల్లులకు సమర్పించి, మొక్కులు చెల్లించుకున్నారు.
ఈ సందర్భంగా కడియం విలేకరులతో మాట్లాడుతూ మేడారం మహాజాతర అభివృద్ధికి సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేసి తీరుతారని అన్నారు. 2016, 2018లో జరిగిన మహా జాతరల్లో భక్తులకు సకల సౌకర్యాలు కల్పించడం కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం వందల కోట్లు వెచ్చించిందని గుర్తు చేశారు. వచ్చే మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తించడానికి ఏర్పాట్లు చేస్తామని చెప్పారు.
అన్ని ప్రాంతాలకు పులివెందుల గ్యాంగులు: బుచ్చయ్య చౌదరి