telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ

ఈవీఎం లలో .. అభ్యర్థుల ఫోటోలు కూడా..

evm with candidate photos

ఈవీఎంలలో ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఫొటోలు కూడా ఈసారి ప్రత్యక్షం కానున్నాయి. ఇప్పటి వరకు ఈవీఎంలలో అభ్యర్థుల పేర్లు, వారు పోటీ చేస్తున్న పార్టీ గుర్తు మాత్రమే ఉండేవి. కొన్ని నియోజకవర్గాల్లో ఒకే పేరున్న ఇద్దరు, ముగ్గురు అంతకంటే ఎక్కువ మంది అభ్యర్థులు పోటీ చేస్తుండటంతో ఓటర్లలో గందరగోళం నెలకొంటోంది.

దీని వల్ల తమ ఓట్ల శాతంపై ప్రభావం పడుతోందని ఆయా అభ్యర్థులు గతంలోనే ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలోనే పోటీ చేస్తున్న అభ్యర్థుల గురించి స్పష్టంగా తెలిసేలా వారి ఫొటోలు పెట్టాలని నిర్ణయించినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు.

Related posts