ఈసారి ఈవీఎంల భద్రత ప్రభుత్వానికి పెద్ద సమస్యగానే పరిణమించింది. గత ఎన్నికలలో ఈవీఎం ట్యాంపరింగ్ ఆరోపణల నుంచి బయటపడే ప్రయత్నం చేసిన ప్రభుత్వానికి ఇది పెద్ద సవాల్ అనే అంటున్నారు. యూపీలోని నోయిడా జిల్లా ఎన్నికల అధికారి… పోలింగ్ ఆఫీసర్లకు పలు సూచనలు చేశారు. ఈవీఎంలను, వీవీప్యాట్ మెషిన్లు పర్యవేక్షించేందుకు 18 మంది అధికారులను నియమించినట్లు ఆయన తెలిపారు.
ఈ అధికారులు ఈవీఎంలు… ఎలుకలు, పందికొక్కుల బారిన పడకుండా చూస్తారని తెలిపారు. వీరు మూడు షిప్టుల్లో 24 గంటలూ ఈవీఎంలను పర్యవేక్షిస్తారని తెలిపారు. వీరితోపాటు ఈవీఎంలు భద్రపరచిన కేంద్రాలకు పోలీసుల బందోబస్తును ఏర్పాటు చేశారు. కాగా ఈవీఎంలు ఉంచే స్ట్రాంగ్ రూంలలో సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేయనున్నారు. వీటిని జిల్లా ఎన్నికల అధికారి పర్యవేక్షించనున్నారని తెలిపారు.