telugu navyamedia
సినిమా వార్తలు

“ఎవరు” లాభాల లెక్కలు ఇవే…

maheshbabu review on yevaru movie

“క్ష‌ణం” సినిమాతో ఊహించని సక్సెస్ ను అందుకున్నాడు హీరో అడివిశేష్. లిమిటెడ్ బడ్జెట్‌లో రూపొందించిన ఈ సినిమా టాక్ ఆఫ్ ది ఇండ‌స్ట్రీ అయ్యింది. ఇప్పుడు మ‌రోసారి పివిపి సినిమా, హీరో అడివిశేష్ కాంబినేష‌న్‌లో “ఎవ‌రు” అనే థ్రిల్ల‌ర్ రూపొందించారు. వెంక‌ట్ రామ్ జీ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అయ్యారు. పెర‌ల్ వి.పొట్లూరి, ప‌ర‌మ్ వి.పొట్లూరి, కెవిన్ అన్నె నిర్మాత‌లు. ఈ చిత్రంలో అడివిశేష్ హీరోగా, రెజీనా క‌సండ్ర హీరోయిన్‌గా, న‌వీన్ చంద్ర కీల‌క పాత్ర‌లో నటించగా… శ్రీచ‌ర‌ణ్ పాకాల సంగీత సార‌థ్యం వహించారు. ఈ చిత్రానికి వంశీ ప‌చ్చిపులుసు సినిమాటోగ్రఫీ అందించారు. ఈ చిత్రం స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్ట్ 15న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం మొదటి షోతోనే పాజిటివ్ టాక్ తెచ్చుకోవడమే కాకుండా విమర్శల ప్రశంసలు సైతం అందుకుంది. అంతేకాదు సినిమాలోని ట్విస్టులు ప్రేక్షకులను థ్రిల్ చేశాయి. ఈ చిత్రంతో అడవి శేషు తన కెరియర్ హయ్యెస్ట్ వసుళ్లను రాబట్టారు. మొదటి రెండు రోజుల్లోనే రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.1.75 కోట్ల షేర్‌తో డిస్ట్రిబ్యూటర్స్‌కి హ్యాపీ ఫీస్ట్ ఇవ్వగా, మూడోరోజు ఆక్యుపెన్సీ సాధించి లాభాల బాట పట్టింది. అక్కడ నుంచి వరసపెట్టి వచ్చినదంతా లాభామే. ఇప్పటివరకూ కలెక్ట్ చేసిన షేర్ రూ.9.83 కోట్లు. ఏరియా వైజ్ గా ఆ లెక్కలు చూద్దాం.

ఏరియా                                            షేర్ (కోట్లలో)
నైజాం                                               రూ.3.40
సీడెడ్                                               రూ.0.82
నెల్లూరు                                            రూ.0.18
కృష్ణా                                               రూ.0.61
గుంటూరు                                         రూ.0.49
వైజాగ్                                              రూ.1.07
ఈస్ట్ గోదావరి                                     రూ.0.53
వెస్ట్ గోదావరి                                      రూ.0.33
మొత్తం ఆంధ్రా & తెలంగాణా షేర్             రూ.7.43
భారత్ లో మిగతా ప్రాంతాలు                   రూ.0.85
ఓవర్ సీస్                                          రూ.1.55
ప్రపంచవ్యాప్తంగా మొత్తం షేర్                   రూ.9.83

Related posts