telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

డాక్టర్లపై దాడులు దురదృష్టకరం: మంత్రి ఈటల

Etala Rajender

సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో ఓ రోగి మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ అతడి బంధువు జూనియర్ డాక్టర్లపై దాడికి పాల్పడ్డ విషయం తెలిసిందే. ఆ ఆసుపత్రి ఫర్నిచర్‌ను కూడా వారు ధ్వంసం చేయడంతో వైద్యులు నిరసనకు దిగారు. దీనిపై తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్ స్పందించారు. డాక్టర్లపై దాడులు దురదృష్టకరమని అన్నారు. ఇటువంటి చర్యలకు పాల్పడిన వారికి కఠిన శిక్ష పడేలా చూస్తామన్నారు.

జూనియర్ డాక్టర్ల సమస్యలన్నీ పరిష్కరిస్తామని చెప్పారు. ఆందోళన విరమించి విధుల్లో చేరుతున్నందుకు వైద్యులకు ధన్యవాదాలు చెప్పారు. కాగా, తమకు భద్రత కల్పించాలంటూ వైద్యులు చేస్తోన్న ఆందోళనల నేపథ్యంలో గాంధీ మెడికల్ కాలేజ్‌లో నిన్న వైద్యులతో మంత్రి ఈటల సమావేశమయ్యారు. దీంతో వారు తిరిగి విధుల్లో చేరతామని తెలిపినట్టు సమాచారం.

Related posts