telugu navyamedia
క్రైమ్ వార్తలు వార్తలు సామాజిక

అత్తింటి వారికి నవవధువు షాక్.. మత్తుమందిచ్చి నగలతో పరార్

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఓ నవ వధువు వరుడితోపాటు అత్తింటి వారికి షాకిచ్చింది. బడౌన్ జిల్లా చోటాపారా ప్రాంతానికి చెందిన ప్రవీణ్ ఆజంఘడ్ పట్టణానికి చెందిన రియా అనే యువతిని ఈ నెల 9వతేదీన పెండ్లి జరిగింది. వివాహమయ్యాక నవవధువు రియా అత్తింటికి వచ్చింది. రియా రాత్రి భోజనంలో మత్తు మందు కలిపి భర్తతోపాటు అత్తింట్లోని కుటుంబసభ్యులందరికీ పెట్టింది. దీంతో అత్తింటి కుటుంబసభ్యులందరూ మత్తులోకి జారుకున్నారు.

అనంతరం నవ వధువు రియా అత్తింట్లో ఉన్న రూ.70వేల నగదు, మూడు లక్షల రూపాయల బంగారు ఆభరణాలను ఎత్తుకొని పారిపోయింది. ఉదయం మత్తు దిగిపోయి నిద్ర లేచాక చూస్తే ఇంట్లో నవ వధువు రియాతోపాటు నగదు, నగలు లేవు. దీంతో వరుడు ప్రవీణ్ ఇచ్చిన ఫిర్యాదు మేర పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Related posts