రూ. 2 వేల పింఛన్ ఇచ్చి వృద్ధులను టీఆర్ఎస్ ప్రభుత్వం ఆదుకుంటోందని తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. వర్థన్నపేట మున్సిపల్ ఎన్నికల రోడ్షోలో మంత్రి నేడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి శూన్యమన్నారు.
టీఆర్ఎస్ హాయాంలో వర్థన్నపేట ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. వర్థన్నపేట గ్రామపంచాయతీని మున్సిపాలిటీ చేసుకున్నామన్నారు. . తాగునీటికి, సాగునీటికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసి చెరువుల్లో నీళ్లు నింపిన ఘనత సీఎం కేసీఆర్దేనన్నారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో పల్లెల్లో పచ్చదనం వెల్లివిరిసిందని మంత్రి పేర్కొన్నారు.