తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్వీయ క్వారంటైన్ లోకి వెళ్లిపోయారు. ఆయన వ్యక్తిగత కార్యదర్శితో పాటు ఇద్దరు గన్ మన్లు, ఓ కానిస్టేబుల్, డ్రైవర్, మరో సహాయకుడికి కరోనా పాజిటివ్ వచ్చింది. వారంతా గత కొన్ని రోజులుగా ఎర్రబెల్లితోనే ఉండటంతో ఆయన హోమ్ క్వారంటైన్ లోకి వెళ్లిపోయారు.
ఈ నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. వరంగల్ గ్రామీణ జిల్లా పర్వతగిరిలో మంత్రి స్వగృహంలో 40 మందికి వైద్యాధికారులు కరోనా పరీక్షలు నిర్వహించారు. టెస్టుల తరువాత ఆరుగురికి పాజిటివ్ వచ్చింది. వీరందరినీ చికిత్సనిమిత్తం హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.