సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తొలిసారి మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో “ఎంటర్ ది గర్ల్ డ్రాగన్” చిత్రాన్ని రూపొందిస్తున్నారు. పూజా బాలేకర్ ప్రధాన పాత్రలో నటిస్తోంది. రవిశంకర్ మ్యూజిక్ అందించగా… ఇండో చైనీస్ కో ప్రొడక్షన్ మూవీని జింగ్ లీ, నరేశ్ టీ, శ్రీధర్ టీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. భారత్లో నిర్మిస్తున్న తొలి మార్షల్ ఆర్ట్ చిత్రం ఇదేనని చెబుతున్నాడు వర్మ. ఇటీవల చిత్ర టీజర్ విడుదల కాగా, దీనికి భారీ రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం ఇండో చైనీస్ కొలాబరేషన్ లో నిర్మితమవుతుంది. అయితే ఈసినిమాలో పూజా పోరాట సన్నివేశాలకి సంబంధించి మేకింగ్ వీడియో విడుదల చేశారు వర్మ. టీజర్లో మీరు చూసినవి డూప్ కాదు. పూజా భాలేకర్ భాలేకర్ తైక్వాండో మార్షల్ ఆర్టిస్ట్. బ్రూస్లీ స్టైల్ కోసం ప్రత్యేకంగా శిక్షణ తీసుకుందని వర్మ పేర్కొన్నారు. చిత్రంలో ఈ నూతన నటి ఓవైపు అందాల ఆరబోతను, మరోవైపు ఫైట్ సీన్లను సమంగా బ్యాలెన్స్ చేయనున్నట్టు టీజర్ని బట్టి అర్ధమవుతుంది. ఇండోచైనా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా అంతర్జాతీయ ట్రైలర్ను బ్రూస్ లీ సొంత పట్టణమైన చైనాలోని ఫోషన్ సిటీలో డిసెంబర్ 13న విడుదల చేయనున్న సంగతి తెలిసిందే.
previous post