ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి వైఎస్ షర్మిల సోషల్మీడియాలో తనపై దుష్ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని సోమవారం హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. షర్మిల ఇచ్చిన ఫిర్యాదుపై సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో విచారణ వేగం పెంచామని అదనపు డీసీపీ రఘువీర్ తెలిపారు.
కొన్ని యూట్యూబ్ చానాళ్లు, ఫేస్బుక్ గ్రూప్లలో ఎక్కువగా అసభ్యకరంగా మెసేజ్లు పెట్టారన్నారు. సామాజిక మాధ్యమాల్లో వీడియోలు, కామెంట్లకు సంబంధించి యూఆర్ఎల్లపై దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు. ఇప్పటికే విచారణ కోసం స్పెషల్ టీమ్లను ఏర్పాటు చేశామని, యూట్యూబ్, ఫేసుబుక్ నుంచి సమాచారం రావలసి ఉందని రఘువీర్ తెలిపారు. వీడియోలు తయారు చేసిన వాళ్లతో పాటు దీని వెనుకాల ఉన్న వాళ్లను కూడా గుర్తించి వారిపై కూడా చర్యలు తీసుకుంటామన్నారు.
ఎగ్జిట్ పోల్స్ ను పట్టించుకోవడం లేదు: లక్ష్మీనారాయణ