నేడు ప్రపంచకప్ లో భాగంగా భారత్-ఇంగ్లాండ్ జట్లు తలపడనున్నాయి. బర్మింగ్ హోమ్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ లో భాగంగా ఇంగ్లాండ్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. మరికొద్ది సేపట్లో ప్రారంభం కానున్న ఈ మ్యాచ్ లో ఆరెంజ్ జెర్సీతో భారత జట్టు బరిలోకి దిగనుంది.
టోర్నీలో అపజయం ఎరుగని ఏకైకజట్టుగా ఉన్న టీమిండియా ఈ మ్యాచ్ లో గెలిస్తే నేరుగా సెమీస్ లో స్థానం సంపాదించుకుంటుంది. టీమిండియా ప్లేయర్ విజయశంకర్ స్థానంలో రిషబ్ పంత్ కు చోటు దక్కింది. తాజా స్కోర్ బోర్డు : 17 ఓవర్లలో 124/0.