telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

టాప్‌ లేపిన టీం ఇండియా.. 7 పరుగుల తేడాతో ఘన విజయం

తప్పక గెలువాల్సిన వన్డేలో టీం ఇండియా దుమ్ములేపింది. ప్రత్యర్థి ఇంగ్లండ్‌పై ఇండియా జట్టు భారీ విజయం సాధించింది. అటు బ్యాటింగ్‌, ఇటు బౌలింగ్‌లోనూ చెలరేగిపోయిన టీం ఇండియా… 7 పరుగులతో ఇంగ్లండ్‌పై విజయం సాధించింది. దీంతో 3 వన్డేల సిరీస్‌ను టీం ఇండియా 2-1 తేడాతో గెలుచుకుంది. మూడు ఫార్మాట్‌లోనూ ఇంగ్లండ్‌పై టీం ఇండియా సిరీస్‌లు గెలుచుకుంది. 330 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ 322-9 చేసి ఓటమి చవి చూసింది. ఇక ఇంగ్లండ్‌ జట్టులో ఆల్‌ రౌండర్‌ సామ్‌ కరన్‌ అద్భుత పోరాటంతో టీం ఇండియా బౌలర్లను ఓ ఆట ఆడుకున్నాడు. కరన్‌ 83 బంతుల్లో 95 పరుగులు చేశాడు. ఇందులో 3 సిక్సర్లు, 9 ఫోర్లు ఉన్నాయి. భారత్‌ బౌలింగ్‌ విషయానికి వస్తే.. ఠాకూర్‌ 4 వికెట్లు, భువీ 3 వికెట్లు, నటరాజన్‌ ఒక వికెట్‌ పడగొట్టారు. ఇక అంతకు ముందు బ్యాటింగ్‌ చేసిన టీం ఇండియా.. 50 ఓవర్లలో 329 పరుగులకు ఆలౌట్‌ అయింది. క టీం ఇండియా బ్యాటింగ్‌ విషయానికి వస్తే.. కీపర్‌ పంత్‌ 78 పరుగులు, ఓపెనర్‌ ధావన్‌ 67 పరుగులు, పాండ్యా 64 పరుగులు చేసి.. జట్టును ఆదుకున్నారు. ఓపెనర్‌గా వచ్చిన ధావన్‌ మంచి ఆరంభం ఇవ్వగా.. మిడిల్‌ ఓవర్లలో పంత్‌ టీం ఇండియాను ఆదుకున్నారు. చివర్లో పాండ్యా బ్రదర్స్‌, షార్దూల్‌ పర్వాలేదనిపించారు. ఇక ఈ మ్యాచ్‌లో విరాట్‌ కోహ్లి ఘోరంగా ఫెల్యూర్‌ అయ్యాడు. ఇక ఇంగ్లండ్‌ బౌలర్లలో మార్క్‌ వుడ్‌ 3 వికెట్లు, రశీద్‌ 2 వికెట్లు తీసి టీం ఇండియా భారీ స్కోర్‌ చేయకుండా అడ్డుకట్ట వేశారు.

Related posts