తప్పక గెలవాల్సిన మూడో వన్డేలో టీం ఇండియా దుమ్ములేపింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన టీం ఇండియా.. ఆరంభం నుంచి చివరి వరకు బాగానే ఆడింది. టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్ రాణించడంతో టీం ఇండియా 329 పరుగులు సాధించింది. అయితే.. చివర్లో బ్యాట్స్మెన్స్ తడపడటంతో… ఇండియా 48.2 ఓవరల్లో 329 పరుగులకు ఆలౌట్ అయింది. ఇక టీం ఇండియా బ్యాటింగ్ విషయానికి వస్తే.. కీపర్ పంత్ 78 పరుగులు, ఓపెనర్ ధావన్ 67 పరుగులు, పాండ్యా 64 పరుగులు చేసి.. జట్టును ఆదుకున్నారు. ఓపెనర్గా వచ్చిన ధావన్ మంచి ఆరంభం ఇవ్వగా.. మిడిల్ ఓవర్లలో పంత్ టీం ఇండియాను ఆదుకున్నారు. చివర్లో పాండ్యా బ్రదర్స్, షార్దూల్ పర్వాలేదనిపించారు. ఇక ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లి ఘోరంగా ఫెల్యూర్ అయ్యాడు. ఇక ఇంగ్లండ్ బౌలర్లలో మార్క్ వుడ్ 3 వికెట్లు, రశీద్ 2 వికెట్లు తీసి టీం ఇండియా భారీ స్కోర్ చేయకుండా అడ్డుకట్ట వేశారు. ఇక ఇంగ్లండ్ ఈ మ్యాచ్ గెలవాలంటే 50 ఓవర్లలో 330 పరుగులు చేయాల్సి ఉంటుంది. కాగా టాస్ గెలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ బట్లర్..బౌలింగ్కే మొగ్గు చూపాడు. దీంతో ఇండియా బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది.
previous post
next post
సీఏఏకు వ్యతిరేకంగా భారీ కుట్ర: అమిత్ షా