తెలంగాణలో రేపు ప్రారంభం కావల్సిన 2019 విద్యా సంవత్సరం ఇంజినీరింగ్ వెబ్ ఆప్షన్ల నమోదు ప్రక్రియ మరోసారి వాయిదా పడింది. ఇంజినీరింగ్ ఫీజుల విషయంలో స్పష్టత రాకపోవడంతో వాయిదా వేశారు. జులై 5 నుంచి వెబ్ ఆప్షన్ల ప్రక్రియను చేపట్టనున్నట్టు ఎంసెట్ ప్రవేశాల కన్వీనర్ నవీన్ మిట్టల్ తెలిపారు.
ఇంజినీరింగ్ ఫీజులను తాత్కాలికంగా 15 నుంచి 20 శాతం పెంచాలని టీఏఎఫ్ఆర్సీ నిర్ణయించింది. అయితే దీనికి సంబంధించిన ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. ఇంజినీరింగ్ అభ్యర్థుల ధ్రువ పత్రాల పరిశీలన జులై 3 వరకూ కొనసాగనుందని వెల్లడించారు.
జగన్ గారూ మీరు ఏపీకి సీఎం.. సాక్షి పేపర్ చదవడం మానేయండి?: నారా లోకేశ్