telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికకు.. నేడు ముగియనున్న నామినేషన్ల పర్వం

election nomination starts from today

తెలంగాణలో హుజూర్‌నగర్‌ అసెంబ్లీ ఉప ఎన్నికకు నామినేషన్ల పర్వం నేటితో ముగియనుంది. ఈ రోజు ప్రధాన పార్టీల అభ్యర్థులంతా నామినేషన్‌ వేయనున్నారు. టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, జీజేపీ, టీడీపీ, సీపీఎం, స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్‌ దాఖలు చేస్తారు. నామినేషన్‌ స్వీకరించే తహసీల్దార్‌ కార్యాలయం చుట్టూ అధికారులు, పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రధాన పార్టీల అభ్యర్థులంతా నేడు నామినేషన్‌ వేయనున్నారు.

టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సైదిరెడ్డి నామినేషన్‌కు మంత్రులు జగదీష్‌ రెడ్డి, పల్లా రాజేశ్వర్‌ రెడ్డి హాజరవుతారు. కాంగ్రెస్‌ అభర్థి పద్మావతి నామినేషన్‌కు ఎంపీ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు హాజరవుతారు. జీజేపీ అభ్యర్థి కోటా రామారావు నామినేషన్‌కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కే. లక్ష్మణ్‌ హాజరుకానున్నారు. ఈ ఉప ఎన్నికకు అక్టోబర్‌ 21న పోలింగ్ జరగనుంది. 24న ఎన్నికల కమిషన్‌ ఫలితాలు వెల్లడించనుంది.

Related posts