telugu navyamedia
క్రైమ్ వార్తలు వార్తలు

ఎన్​ కౌంటర్​ లో ఎనిమిది మంది మావోల మృతి

naksals encounter

ఛత్తీస్ గఢ్ లో జరిగిన భారీ ఎన్ కౌంటర్ లో ఎనిమిది మంది మావోయిస్టులు మృతి చెందారు. .ఆపరేషన్ ప్రహార్ లో భాగంగా సుక్మా జిల్లాలోభద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహించాయి. తొండమార్కా, దుర్మా, బడేకదేవాల్ అటవీప్రాంతంలో మావోయిస్టులకు, భద్రతా బలగాలకు ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఆయుధాలు, ఇతర సామగ్రిని సంబంధిత అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

గత రెండు రోజులుగా సుక్మా జిల్లా కిష్టారం ప్రాంతంలో భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహించారు. ఈ క్రమంలో ఇరు పక్షాల మధ్య పరస్పర కాల్పులు జరిగాయి. ఈ నెల 18న ఒక జవాన్ ని వారు కాల్చి వేశారు. ఆ మరుసటి రోజే మావోయిస్టుల సానుభూతిపరుడు ఒకరిని హతమార్చిన ఘటన చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో ఎప్పుడేమీ జరుగుతుందోనని పరిసర గ్రామాల ప్రజలు జంకుతున్నారు.

Related posts