telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

తెలంగాణ సీఎస్ కు లేఖ రాసిన ఉద్యోగుల ఐక్యవేదిక

2018 మే 16 న గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలోని తొమ్మిది లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, పబ్లిక్ సెక్టార్& కాంట్రాక్టు ఉద్యోగులు పిఆర్సీ అమలు కోసం గత ముప్పది నెలలుగా ఎదురు చూస్తున్నారు. నివేదిక సమర్పించి పదిహేను రోజులు గడచినా పిఆర్సీ సిఫారసులను పబ్లిక్ డొమైన్ లో ఉంచలేదు. ఇతర హామీల అమలుకు నిర్ధిష్ట ఉత్తర్వులు ఇవ్వలేదు. ఈనెల6,7 తేదీల్లో సంఘాలతో చర్చలు జరపమని ముఖ్యమంత్రి ఆదేశించినట్లు వచ్చిన వార్తలు అమలు జరగలేదు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, పబ్లిక్‌ సెక్టార్‌ ఉద్యోగుల ఐక్యవేదిక సీఎస్‌ సోమేష్‌ కుమార్‌కు లేఖ రాశారు.

డిమాండ్స్:

1. పిఆర్సీ నివేదికను వెంటనే పబ్లిక్ డొమైన్ లో పెట్టి ప్రజలకు అందుబాటులో ఉంచాలి.

2. ఈ నెలాఖరులోగా సంఘాలతో చర్చించి ఆమోదయోగ్యమైన ఫిట్మెంట్ తో 1.07.2018 నుండి నూతన వేతనాలు అమలు చేయాలి.

3. 16 మే 2018 న ముఖ్యమంత్రి ఇచ్చిన హామీల అమలుకు ఉత్తర్వులు ఇవ్వాలి.

4. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలి.

5. సిపిఎస్ రద్దుచేసి పాత పెన్షన్ పునరుద్దరించాలి.
1.09.2004 కు ముందు ఎంపిక ప్రక్రియ పూర్తై తర్వాత నియామకమైన ఉద్యోగులు, ఉపాధ్యాయులకు పాత పెన్షన్ వర్తింపజేయాలి.

Related posts