telugu navyamedia
సినిమా వార్తలు

మేఘాంశ్ చేసిన పనితో శ్రీహరి కోరిక నెరవేరింది : డిస్కో శాంతి

Rajdooth

రియ‌ల్ స్టార్ శ్రీహ‌రి మేఘాంశ్ హీరోగా “రాజ్‌దూత్” అనే సినిమా తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. లక్ష్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై సత్తి బాబు నిర్మిస్తున్న ఈ మూవీని, కార్తీక్, అర్జున్ అనే ఇద్దరు యంగ్ డైరెక్టర్స్ తెర‌కెక్కిస్తున్నారు. రొమాంటిక్ యూత్‌ఫుల్‌ లవ్ స్టోరీగా తెరకెక్కనున్న ఈ సినిమాలో మేఘాంశ్ మాస్ రోల్ లో కనిపించనున్నాడు. ఇక క‌థానాయిక‌గా నక్షత్ర కనిపించనుంది. సత్యనారాయణ నిర్మాతగా వ్యవహరిస్తోన్న ఈ నెల 12వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు జోరందుకున్నాయి. తాజాగా డిస్కోశాంతి మాట్లాడుతూ ” మొదటి నుంచి కూడా శ్రీహరి తన పిల్లలిద్దరూ చిత్రపరిశ్రమలోనే వుండాలని భావించేవాడు. ఒకరు దర్శకుడైతే మరొకరు హీరో కావాలని ఆయన కోరుకునేవాడు. నాకు మాత్రం వాళ్లు చిత్రపరిశ్రమకి రావడం ఇష్టం లేదు. ఒకరు డాక్టర్ కావాలనీ .. మరొకరు లాయర్ కావాలని ఉండేది. కానీ పెద్దాడు దర్శకత్వం దిశగా అడుగులు వేస్తున్నాడు. ‘రాజ్ దూత్’తో మేఘాంశ్ హీరోగా మారిపోయాడు. కనుక శ్రీహరి కోరిక నెరవేరిపోయింది” అని ఆమె చెప్పుకొచ్చింది. మేఘాంశ్ కు ఇదే మొదటి చిత్రం కావడం విశేషం. ఇక ఈ చిత్రం నుండి “ఏమో ఏమో…” అంటూ సాగే లవ్ లిరికల్ సాంగ్ ను విడుదల చేసింది చిత్రబృందం. ఈ లిరికల్ వీడియో యూత్ ను అట్ట్రాక్ట్ చేస్తోంది.

Related posts