నేటి నుండే తెలంగాణలో ఎంసెట్ వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ప్రారంభం. ఈ నేపథ్యంలో ఇంజనీరింగ్ ఫీజులను ఖరారు చేస్తూ జీవో జారీ అయింది. ఈ ఇంజనీరింగ్ ఫీజులు మూడేళ్లపాటు అమలులో ఉండనున్నాయి. 103 ఇంజనీరింగ్ కళాశాలకు పూర్తి స్థాయి రుసుములు, 88 కళాశాలలకు తాత్కాలిక రుసుములు ఖరారు చేశారు. రాష్ట్రంలో 22 కళాశాలల్లో లక్షకు పైగా ఫీజులను నిర్ణయించారు.
ఇంజనీరింగ్ కళాశాలల్లో కనీస రుసుం రూ.35 వేలు కాగా, అత్యధికంగా చైతన్య భారతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ (సీబీఐటీ)కు రూ.1.34 లక్షలుగా ప్రభుత్వం నిర్ణయించింది.