శ్రీ రామ్ క్రియేషన్స్, విఎం స్టూడియో పతాకాలపై హరికుమార్ నిర్మాతగా రాజీవ్ సిద్దార్ధ్, శాణు మజ్జారి హీరో హీరోయిన్లుగా మురళీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం “ఏమైపోయావే”. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్ర ఫస్ట్ లుక్ను దసరా సందర్భంగా విడుదల చేశారు.
ఈ చిత్రం గురించి దర్శకుడు మురళీ మాట్లాడుతూ.. “ఏమైపోయావే ఒక ప్యూర్ ఎమోషనల్ కంటెంట్తో తెరకెక్కుతున్న ట్రై యాంగిల్ లవ్ స్టోరీ. చిత్రీకరణ కొత్తగా ఉండి ఆడియన్స్కి ఫ్రెష్ మూవీని చూస్తున్నాం అనే అనుభూతినిస్తుంది. హీరో హీరోయిన్లు కొత్తవారైనా చాలా చక్కగా నటించారు. అలాగే మా నిర్మాత హరికుమార్గారు మేకింగ్లో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మిస్తున్నారు. సినిమా అవుట్ పుట్ చాలా బాగా వస్తోంది. తప్పకుండా మీ అందరికీ నచ్చే చిత్రం అవుతుంది” అన్నారు.
నిర్మాత హరికుమార్ మాట్లాడుతూ.. “మా బేనర్లో ఒక మంచి ఫీల్ గుడ్ ఎంటర్టైనర్గా “ఏమైపోయావే” రూపొందుతుంది. దసరా శుభాకాంక్షలతో మా చిత్ర ఫస్ట్ లుక్ని రిలీజ్ చేయడం సంతోషంగా ఉంది. మురళీ గారు ఎంతో అనుభవం ఉన్న డైరెక్టర్లా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అందరూ కొత్తవారైనా మంచి సపోర్ట్ లభిస్తోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తాం” అన్నారు.