హరీష్ శంకర్ దర్శకత్వంలో వరుణ్ తేజ్, పూజా హెగ్డే జంటగా నటించిన “గద్ధల కొండ గణేష్” గత శుక్రవారం విడుదలై బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ఫుల్గా దూసుకెళుతుంది. ఈ సినిమాలో వరుణ్ తేజ్, పూజా హెగ్డేల మధ్య ఎల్లువొచ్చి గోదారమ్మ రీమేక్ సాంగ్ చిత్రీకరించగా… ఈ సాంగ్కి థియేటర్స్లో అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది. సీట్లలో నుండి లేచి మరీ ఆడియన్స్ స్టెప్పులేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోని పూజా హెగ్డే తన ట్విట్టర్లో పోస్ట్ చేసింది. “ఇందుకే నేను చేయాల్సిందాని కోసం మైళ్ళు వెళుతుంటాను. ఇవన్నీ చూస్తే చింతలన్నీ మరిచిపోతాం. ఆనందించడం, థియేటర్లలో ఇలా నృత్యం చేయడం, నిద్రలేని రాత్రులు, ప్రయాణం, ఎండలో నిలబడి సినిమాలు చేయడం మీ ప్రేమ ముందు మరిచిపోతాం. ఎల్లువొచ్చి గోదారామ్మ లవ్ యూ” అంటూ కామెంట్ కూడా పెట్టింది పూజా. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ పోస్ట్ వైరల్ గా మారింది. ఇక శోభన్ బాబు, శ్రీదేవి, జయప్రద ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం దేవత. ఇందులో శ్రీదేవి, శోభన్ బాబు మధ్య వచ్చే “ఎల్లువొచ్చి గోదారమ్మ” అనే సాంగ్ ఎంత పాపులర్ అయిందే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇందులో బిందెల మధ్య వీరిద్దరు నృత్యం చేయడం అభిమానులని ఎంతగానో ఆకట్టుకుంది.
THIS is why I go the extra mile to do what I do…to watch you forget all your worries,enjoy and DANCE like this in the theatres…the sleepless nights, the travelling, the standing in the scorching sun to make movies,You make it WORTH IT. THANK YOU. #ElluvochiGodaramma ❤️ Love u pic.twitter.com/WM498vsNae
— Pooja Hegde (@hegdepooja) September 21, 2019
“అరే పవన్” అంటూ శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు