telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

కారెక్కిన మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే!

Congress MLA join shortly TRS

లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకీ రోజురోజుకూ గడ్డు పరిస్థితి ఎదురవుతుంది. ఇప్పటికే 9 మంది ఎమ్మేల్యేలు టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు ప్రకటించారు. తాజాగా మరో ఎమ్మెల్యే ఈ జాబితాలో చేరారు. నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్‌ బుధవారం టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ ను కలిశారు. తాను కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. త్వరలోనే టీఆర్‌ఎస్‌లో చేరనున్నారు. సీఎం కేసీఆర్‌ నాయకత్వాన్ని రాష్ట్ర ప్రజలంతా కోరుకుంటున్నారని సురేందర్‌ పేర్కొన్నారు.

సురేందర్‌ ప్రకటనతో టీఆర్‌ఎస్‌లో చేరిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల సంఖ్య 10కి చేరింది. అసెంబ్లీ ఎన్నికల్లో 19 స్థానాల్లో కాంగ్రెస్‌ విజయం సాధించగా ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు.ఇప్పటికే ఆత్రం సక్కు, రేగ కాంతారావు, చిరుమర్తి లింగయ్య, పట్లోళ్ల సబితారెడ్డి, బానోతు హరిప్రియా నాయక్, కందాల ఉపేందర్‌రెడ్డి, బీరం హర్షవర్ధన్‌రెడ్డి, డి.సుధీర్‌రెడ్డి, వనమా వెంకటేశ్వర్‌రావు టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు ప్రకటించారు. తాజాగా సురేందర్‌ కూడా కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పదాంతో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల సంఖ్య 9కి తగ్గింది.

Related posts