telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ

హైదరాబాద్ రోడ్డెక్కి.. చక్కర్లు కొడుతున్న.. ఎలక్ట్రిక్ బస్సులు..! చార్జీల మోత !!

electric buses on roads of hyderabad with ac charges

మొత్తానికి అనుకున్నట్టే నేటి నుండే ఎలక్ట్రిక్ బస్సులు హైదరాబాద్‌ రోడ్లెక్కి పరుగులు పెట్టనున్నాయి. పెరిగిపోతున్న వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడంలో భాగంగా పర్యావరన సహిత బస్సులను తెలంగాణ ఆర్టీసీ అందుబాటులోకి తీసుకొచ్చింది. తొలి విడతలో భాగంగా 40 బస్సులు అందుబాటులోకి వచ్చాయి. వీటిలో మియాపూర్-2, కంటోన్మెంట్ డిపోల నుంచి 20 బస్సుల చొప్పున శంషాబాద్ విమానాశ్రయ రూట్లలో నడపనున్నారు. ఇప్పటికే ఈ బస్సులు విజయవంతంగా ట్రయల్ రన్స్ పూర్తి చేశాయి. నేటి సాయంత్రం మియాపూర్-2 డిపోలో వీటిని లాంఛనంగా ప్రారంభించనున్నారు.

ఏసీ బస్సు చార్జీలనే ఈ బస్సుల్లోనూ వసూలు చేయనున్నట్టు అధికారులు తెలిపారు. ప్రయాణికుల డిమాండ్‌ను బట్టి నగరంలోని ఇతర రూట్లకు వీటిని విస్తరించనున్నట్టు తెలిపారు.

Related posts