telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

హైదరాబాద్ .. రోడ్డెక్కుతున్న… విద్యుత్ బస్సులు…

electric buses in hyderabad

హైదరాబాద్ రోడ్లపై పరుగులు తీసేందుకు విద్యుత్ బస్సులు సిద్ధంగా ఉన్నాయి. ట్రయల్ రన్ పరీక్షలు పూర్తిచేశారు అధికారులు. తొలివిడతగా కొన్ని బస్సులను నడుపుతారు. పర్యావరణ హితమైన విద్యుత్‌ ఆధారిత బస్సులు హైదరాబాద్‌లో త్వరలో సేవలు అందించనున్నాయి. శబ్ద, వాయు కాలుష్యం లేకుండా ఉండాలన్న ఉద్దేశంతో మహా నగరంలో వంద ఎలక్ట్రికల్‌ బస్సులు నడపాలని టీఎస్‌ ఆర్టీసీ నిర్ణయించింది. ఇందుకుగాను ఓ ప్రైవేటు సంస్థతో ఒప్పందం కుదుర్చుకోగా తొలివిడత 40 బస్సులను నడిపేందుకు ఆ సంస్థ ముందుకు వచ్చింది. ప్రస్తుతం ఈ బస్సుల ట్రైల్‌ రన్‌తో శంషాబాద్‌ ఎయిర్‌ పోర్టు రోడ్డులో దూసుకు పోతున్నాయి. నలభై బస్సుల్లో 20 మియాపూర్‌-2కు, 20 కంటోన్మెంట్‌ డిపోకు కేటాయించారు. ఈ బస్సులకు అవసరమైన చార్జింగ్‌ కోసం రెండు డిపోల్లో అవసరమైన కేంద్రాలను ఏర్పాటు చేశారు. బస్సు కండిషన్‌, డ్రైవర్లకు అవగాహన ఏర్పరిచేందుకు ట్రయిల్‌ రన్‌ చేస్తున్నారు.

విద్యుత్‌ ఆధారిత బస్సులు రోడ్లపై పరుగులు తీస్తుంటే హైదరాబాద్‌ వాసులు ఆసక్తిగా తిలకిస్తున్నారు. ఈ బస్సులు నడిపే డ్రైవర్లకు ప్రత్యేక శిక్షణ అందించడంతో పాటు అవసరమైన వైద్య పరీక్షలను కూడా ఆర్టీసీ ఇప్పటికే పూర్తి చేసింది. ఉన్నతాధికారుల నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ వస్తే సంక్రాంతి నుంచి ఈ బస్సులు ప్రయాణికులకు సేవలందించనున్నాయని అధికారులు తెలిపారు. సాధారణ బస్సు చార్జీలనే వీటికి వసూలు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. నగరంలోని పలు ప్రాంతాల నుంచి ఎయిర్‌పోర్టుకు కనెక్టివిటీ కోసం ఈ బస్సులను వినియోగించనున్నారు.

Related posts