telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

గెలుపు గుర్రాలను ఎంపిక చేశాం: చంద్రబాబు

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు 126 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల విడుదల చేసిన సంగతి తెలిసిందే. సుదీర్ఘ కసరత్తు చేసి గెలుపు గుర్రాలను ఎంపిక చేశామని తెలిపారు. శుక్రవారం ఉదయం టీడీపీ నేతలతో చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్యకర్తలు, ప్రజల అభీష్టం మేరకే అభ్యర్థుల ఎంపిక జరిగిందన్నారు.

కాగా టికెట్ ఆశించి భంగపడినవారికి ఆయన భరోసా కల్పించారు. టికెట్ దక్కని వారు నిరాశకు చెందవద్దని చెప్పారు. అందరి సేవలను పార్టీ గుర్తించి న్యాయం చేస్తుందని హామీ ఇచ్చారు. అందరి అభిప్రాయాలు సేకరించి అభ్యర్థులను ప్రకటించటం చరిత్రలో ఇదే తొలిసారి అన్నారు. అలాగే టిక్కెట్లు రాని వారిని రాబోయే రోజుల్లో తగిన ప్రాధాన్యం కలిపిస్తామని చంద్రబాబు పేర్కొన్నారు.

Related posts