ఏపీలో పోలీసు ఉన్నత అధికారులపై పిర్యాదులు ఆగటంలేదు. ఇటీవల కొందరిని బదిలీ చేసినప్పటికీ వారిపై పిర్యాదులు ఆగకపోవటం విశేషం. దీనితో ఎన్నికల అధికారి కే.కే. శర్మ స్వయంగా రంగంలోకి దిగారు.
ప్రస్తుతం శర్మ చేతిలోనే ఏపీ పోలీసు వ్యవస్థ అంతా ఉంది. దీనితో ఆయనే స్వయంగా దానిని పర్యవేక్షిస్తున్నారు. ముగ్గురు అధికారుల బదిలీ అనంతరం ఆయన రంగంలోకి దిగాల్సి వచ్చింది. ఇటీవల ఫోన్ ట్యాపింగ్ పై వైసీపీ ఎన్నికల సంఘానికి పిర్యాదు కూడా చేసింది. ఈ విషయంలో బదిలీ అయిన ఇంటెలిజెన్స్ అధికారి పేరు బాగా వినిపిస్తుండటంతో శర్మను రంగంలోకి దించినట్టు తెలుస్తుంది.
53 ఏళ్ల సల్మాన్తో 21 ఏళ్ల యువతి రొమాన్స్…. సోనాక్షి కామెంట్స్