కేంద్ర మంత్రి స్మృతీ ఇరాని రాజకీయాల్లోకి రాకముందు మోడలింగ్ రంగంలో రాణించారు. 1998లో మిస్ ఇండియా కాంటెస్ట్లోనూ ఆమె పాల్గొన్నారు. అంతేకాదు టీవీ నటిగా, నిర్మాతగా గుర్తింపును సంపాదించుకున్నారు. ఆ సమయంలో స్మృతీ ఇరాని మాట్లాడుతూ రాజకీయాలంటే తనకెంతో ఆసక్తి అని తెలిపారు. కొన్నేళ్ల తర్వాత స్మతీ ఇరాని రాజకీయాల్లో అడుగు పెట్టి సక్సెస్ అయ్యారు. ఇప్పుడు ఆమె బీజేపీ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పని చేస్తున్నారు. శుక్రవారం బాలీవుడ్ లేడీ ప్రొడ్యూసర్ ఏక్తా కపూర్ 1998లో స్మృతీ ఇరాని పాల్గొన్న మిస్ ఇండియా కాంటెస్ట్ వీడియోను తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. “వినయం, మాట నిలబెట్టుకునే తత్వమే స్మృతిని అద్భుతమైన వ్యక్తిగా తీర్చిదిద్దాయి. నా స్నేహితురాలిని చూసి ఎంతో గర్వపడుతున్నాను” అంటూ ఏక్తా కపూర్ మెసేజ్ కూడా పోస్ట్ చేశారు.
next post