telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ

కరీంనగర్ జిల్లా : … ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన ఈటల.. 500 పడకలతో కొత్త భవనాలు..

eetela sudden visit to karimnagar govt hospital

రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ జిల్లా ఆస్పత్రిని ఆకస్మిక తనిఖీ చేశారు. ఆస్పత్రి పరిశీలన అనంతరం మంత్రి మాట్లాడుతూ.. కరీంనగర్ మాతాశిశు సంరక్షణ కేంద్రాన్ని మరింతగా విస్తరించనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఉన్న 150 పడకలకు అదనంగా మరో 100 పడకలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఆస్పత్రిని కూడా విస్తరిస్తామని తెలిపారు.

కరీంనగర్‌లో కొత్తగా 500 పడకల ఆస్పత్రి భవనం నిర్మిస్తామన్నారు. పాత భవనం కూల్చివేసి ఏడాదిలోపు కొత్తభవనం నిర్మిస్తామని మంత్రి పేర్కొన్నారు.

Related posts