telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

వాన్‌పిక్ కేసులో … ఆ ఇద్దరికీ .. ఊరట ..

ys jagan cm

గతంలో ఈడీ ప్రస్తుత ఏపీ సీఎం జగన్‌కు చెందిన రూ.538 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసిన విషయం తెలిసిందే. ఈ జప్తును రద్దు చేయాలని ఈడీ ట్రైబ్యునల్ ఆదేశాలు జారీ చేసింది. వాన్‌పిక్ కేసులో జగన్, నిమ్మగడ్డ ప్రసాద్‌కు ఊరట లభించింది. ఈ కేసులో జప్తు చేసిన ఇరువురి ఆస్తులనూ విడుదల చేయాలని ట్రైబ్యునల్ ఆదేశించింది.

ఈ కేసులో ఇడుపులపాయలోని 42 ఎకరాలు, బంజారాహిల్స్ సాగర్ సొసైటీలో ప్లాల్లు, పులివెందులలో 16 ఎకరాలు.. మొత్తం రూ.538 కోట్ల ఆస్తులను ఈడీ జప్తు చేసింది. అలాగే వాన్‌పిక్ భూములు సహా, నిమ్మగడ్డ ప్రసాద్‌కు చెందిన రూ.325 కోట్ల ఆస్తులను ఈడీ జప్తు చేసింది. కాగా రూ.275 కోట్లకు బ్యాంకు గ్యారెంటీ ఇవ్వాలని ట్రైబ్యునల్ నిమ్మగడ్డకు ఆదేశాలు జారీ చేసింది.

Related posts