telugu navyamedia
క్రీడలు వార్తలు

కాశ్మీర్ మాజీ సీఎం ను ప్రశ్నిస్తున్న ఈడీ అధికారులు…

నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత కాశ్మీర్ మాజీ సీఎం అయిన ఫరూక్ అబ్దులాను ఈడీ ప్రశ్నిస్తుంది. జమ్మూ కాశ్మీర్ క్రికెట్ అసోసియేషన్ యొక్క నిధుల గోల్ మాల్ విషయంలో ఫరూక్ ను ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ విచారణ శ్రీనగర్ లోనే జరుగుతుంది. జమ్మూ కాశ్మీర్ క్రికెట్ అసోసియేషన్ లో 113 కోట్ల గోల్ మాల్ జరిగింది. అయితే ఈ కేసును కోర్టు సీబీఐకి అప్పగించింది. ఆ తర్వాత దీనిపై ఈడీ కేసు నమోదు చేసింది. ఫరూక్ అబ్దులాను రాజకీయంగా ఎదుర్కోవడంలో విఫలమైనందుకే ఆయనను లక్ష్యంగా చేసుకొని దర్యాప్తు సంస్ధలను బీజేపీ ఉసిగొలుపుతుంది అని నేషనల్ కాన్ఫరెన్స్ ఆరోపించింది. ఫరూక్ అబ్దులాను ఈడీ ప్రశ్నించిన తర్వాత నేషనల్ కాన్ఫరెన్స్ ఈ కామెంట్స్ చేసింది. అయితే జమ్మూ కాశ్మీర్ క్రికెట్ అసోసియేషన్ ఛైర్మెన్ గా ఫరూక్ ఉన్న సమయంలో 43 కోట్ల మేర నిధుల దుర్వినియోగం జరిగినట్లు అభియోగాలు ఉన్నాయి. దీని పై ఫరూక్ ను ఈడీ ప్రశ్నిస్తుంది. అయితే ఈ విషయం పై స్పందించిన ఫరూక్ కుమారుడు బీజేపీ కావాలనే ఇందులో తన తండ్రిని ఇరికిస్తుంది అని ఆరోపించాడు.

Related posts