ఈడీ ముందు కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం ఈరోజు హాజరయ్యారు. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో మనీ లాండరింగ్ కు పాల్పడ్డారని ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వివరణ కోసం చిదంబరంను ఈడీ అధికారులు పిలిపించారు.
ఉదయం 11 గంటల ప్రాంతంలో ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి చిదంబరం వెళ్లారు. దాదాపు 2 గంటల సేపు చిదంబరంను ఈడీ అధికారులు విచారించారు. గతంలో కూడా ఈ కేసులో పలుమార్లు చిదంబరంను ఈడీ ప్రశ్నించింది. ఈ కేసులో కార్తీ చిదంబరం కూడా ఈడీ విచారణ ఎదుర్కొన్న విషయం తెలిసిందే..
చంద్రబాబుకు పవన్ పార్ట్నర్: వైఎస్ జగన్