telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ

2 గంటలపాటు .. ఈడీ ప్రశ్నలకు జవాబిచ్చిన.. మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం..

court on karti chidambaram pitition

ఈడీ ముందు కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం ఈరోజు హాజరయ్యారు. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో మనీ లాండరింగ్ కు పాల్పడ్డారని ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వివరణ కోసం చిదంబరంను ఈడీ అధికారులు పిలిపించారు.

ఉదయం 11 గంటల ప్రాంతంలో ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి చిదంబరం వెళ్లారు. దాదాపు 2 గంటల సేపు చిదంబరంను ఈడీ అధికారులు విచారించారు. గతంలో కూడా ఈ కేసులో పలుమార్లు చిదంబరంను ఈడీ ప్రశ్నించింది. ఈ కేసులో కార్తీ చిదంబరం కూడా ఈడీ విచారణ ఎదుర్కొన్న విషయం తెలిసిందే..

Related posts