telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ

నేతలపై .. ఈసీ కొరడా.. ప్రచారానికి నిషేధం..

election-commission

ఎన్నికల సంఘం వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే బీజేపీ మహిళా నేత, భోపాల్ ఎంపీ అభ్యర్థి సాధ్వీ ప్రజ్ఞా సింగ్ కు షాక్ ఇచ్చింది. ప్రజ్ఞా సింగ్ ఏటీఎస్ మాజీ చీఫ్ హేమంత్ కర్కరే, బాబ్రీ మసీదు అంశాలపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన ఈసీ కఠిన నిర్ణయం తీసుకుంది. ప్రజ్ఞా సింగ్ మూడు రోజుల పాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి వీల్లేదంటూ నిషేధం విధించింది. ఈసీ ఆదేశాల నేపథ్యంలో ఈ బీజేపీ నేత 72 గంటల పాటు ఎలాంటి ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనడం కుదరదు.

బాబ్రీ మసీదు కూల్చివేత సమయంలో తాను కూడా ఉన్నానని, అందుకు గర్వపడుతున్నానని చెప్పుకొచ్చారు. మాలేగావ్ పేలుళ్ల కేసు విచారణ సందర్భంగా కర్కరే తనను కొట్టారని, అందుకే తాను శాపం పెట్టానని, ఆ శాపం తగిలే ఆయన పోయారని ప్రజ్ఞా వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు అందడంతో ఈసీ వాటిపై దృష్టి పెట్టింది.

ఎన్నికల ప్రచారం వికృత చేష్టలకు ఆలవాలం అవుతుంది. దీనితో ఈసీ కఠినంగా స్పందించాల్సి వస్తుంది. ఇష్టానికి ప్రచారంలో ఒకరిపై ఒకరు దూషణలు చేసుకుంటున్నారు. కాంగ్రస్ నేత సిద్దు కూడా ఇప్పటికే రెండుసార్లు ప్రచారానికి ఇందుకే దూరం అయ్యాడు. అయినా మారకుండా ఈ నేతలు మళ్ళీ అదే తప్పు చేస్తూనే ఉన్నారు.

Related posts