ఎన్నికల సంఘం అనంతపురం ఎంపీ జేసీ దివాకర్రెడ్డిపై కొరడా ఝళిపించింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో తన కుమారులు జేసీ అస్మిత్రెడ్డి, జేసీ పవన్కుమార్రెడ్డిల కోసం కోట్లాది రూపాయలను ఖర్చు చేయాల్సి వచ్చిందంటూ జేసీ వ్యాఖ్యానించి కలకలం రేపారు. ఆయన వ్యాఖ్యలపై మండిపడిన వైసీపీ, సీపీఐ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.
జేసీ కోడ్ ఉల్లంఘనకు పాల్పడ్డారని తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదును స్వీకరించిన అధికారులు జేసీ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి మాట్లాడడం నిజమేనని నిర్ధారించారు. ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ కలెక్టర్కు ఆదేశాలు జారీ చేశారు.
అమరావతి రైతులు రోడ్డెక్కడానికి చంద్రబాబే కారణం: మంత్రి కన్నబాబు