telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

కరోనా అనుమానిత కేసులు తగ్గుముఖం: మంత్రి ఈటల

Etala Rajender

తెలంగాణలో కరోనా వైరస్ అనుమానిత కేసులు తగ్గుముఖం పడుతున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ లాబీల్లో తనను కలిసిన మీడియా ప్రతినిధులతో తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కరోనా లేనప్పుడు మాస్కు ఎందుకని ప్రశ్నించారు.

కరోనా పై తనపై కుటుంబ సభ్యులు ఏమంటున్నారో వెల్లడించారు.”మీరు నిత్యం ఎక్కడికంటే అక్కడికి వెళుతున్నారు, కరోనా అనుమానితులతో సన్నిహితంగా మెలుగుతున్నారు, అలాగే ఇంటికి వస్తే ఊరుకునేది లేదు…. శుభ్రంగా ఆఫీసులోనే స్నానం చేసి అప్పుడు ఇంటికి రండి అని మా వాళ్లు అంటున్నారు” అని ఈటల వివరించారు.

Related posts