తెలంగాణలో కరోనా పరిస్థితులపై రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాటాడుతూ రోనా రాకతో ప్రపంచమంతా అప్రమత్తమైందని అన్నారు. కవాస్తవానికి కరోనా ప్రభావం ఎలా ఉంటుందన్నది డబ్ల్యూహెచ్ఓ, ఐసీఎంఆర్ లకు కూడా తెలియదని పేర్కొన్నారు.
కరోనాకు ఎవరూ అతీతులు కాదని, అందరికీ సోకుతుందని తెలిపారు. 81 శాతం మందిలో కరోనా వైరస్ సోకినట్టు కూడా తెలియదని అన్నారు. వర్షాకాలం రావడంతో కరోనాకు సీజనల్ వ్యాధులు కూడా తోడవుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రాణాలకు తెగించి వైద్యులు సేవలు అందిస్తుంటే కొందరు అవహేళన చేస్తున్నారని ఈటల ఆవేదన వ్యక్తం చేశారు.